నందిగామ కాంగ్రెస్ అభ్యర్థి బాబూరావు

 

ఆంధ్రప్రదేశ్‌లో... అది కూడా నందిగామలో పోటీ చేస్తే బాబూ.. డిపాజిట్లు కూడా రావు.. అని ఎవరు ఎంతగా చెప్పినా వినకుండా కాంగ్రెస్ పార్టీ అక్కడ తమ అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించుకుంది. ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మృతి కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. ప్రస్తుతం అక్కడ తంగిరాల కుమార్తె తంగిరాల సౌమ్య తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆమెకు సానుభూతిగా వేరే పార్టీలేవీ పోటీ చేయకుండా ఉండాలని, ఏకగ్రీవంగా ఆమెను ఎన్నిక చేయాలని తెలుగుదేశం పార్టీ కోరింది. అయితే జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వినడం లేదు. ఈసారి నందిగామ స్థానం నుంచి ఏపీసీసీ కార్యదర్శి బోడపాటి బాబూరావుతో పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఓడిపోతామని తెలిసినా పోటీ చేయడం అంటే ఇదే.