నందిగం సురేష్ ఫైన్.. మళ్లీ జైలుకు!
Published on: Fri Oct 11, 2024 5:42PM
.webp)
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆరోగ్యం పర్ఫెక్ట్ గా ఉందని వైద్యులు నివేదిక ఇవ్వడంతో ఆయనను మళ్లీ జైలుకు తరలించారు. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేష్ గురువారం తనకు ఛాతీలో, భుజంలో నొప్పిగా ఉందని చెప్పడంతో జైలు అధికారులు ఆయనను హుటాహుటిన గుంటూరు జీజీహెచ్ కు తరలించిన సంగతి తెలిసిందే.
జీజీహెచ్ లో వైద్యలు ఆయన పరీక్షలు నిర్వహించారు. సిటీస్కాన్, ఎంఆర్ఐ స్కాన్ సహా అన్ని చికిత్సలూ చేసిన తరువాత ఆయన ఆరోగ్యం బాగుందని నివేదిక ఇచ్చారు. దీంతో ఆయనను ఆస్పత్రి నుంచి నేరుగా జైలుకు తరలించారు. నందిగం సురేష్ ను ఆస్పత్రికి తీసుకువచ్చిన సంగతి తెలిసి పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.


