అనంతపురంలో ఘోర రైలు ప్రమాదం:23 మంది మృతి

 

ఈ ఉదయం అనంతపురం జిల్లాలొ ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 23 మంది సజీవదహనం అయ్యారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి దగ్గరలొ నాంధేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏసి బొగి ప్రమాద వశాత్తు పూర్తిగా కాలిపోయింది. థర్డ్‌ ఏసి బి1 భోగిలో మంటలు చెలరేగడంతో ప్రమాదం  సంభవించింది. ఈ ప్రమాదంలొ 23 మంది అక్కడి కక్కడే మరణించగా మరి కొంత మంది గాయపడ్డారు, క్షతగాత్రలను సమీపంలొని థర్మవరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం  జరిగిన సమయంలో భోగి మొత్తం 73 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు.