TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యువకుడి వేధింపులతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య..!

Published on: Sun Jul 19, 2026 11:14AM

 

భయంతో యువకుడి సుసైడ్..!

నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో ఒకే రోజు చోటుచేసుకున్న రెండు విషాద మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సమాజానికి సేవ చేయాలనే ఉన్నత ఆశయాలతో, ఎన్నో అవధులు లేని ఆశలతో డాక్టర్ చదువుతున్న ఇరవై ఏళ్ల ఎంబీబీఎస్ వైద్య విద్యార్థిని లక్ష్మీ ప్రసన్న ప్రేమోన్మాదానికి బలవ్వగా, ఆమె మృతికి కారణమైన ఇరవై రెండు ఏళ్ల చిలుముల రామ్ చరణ్ అనే యువకుడు కూడా భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

కన్నవారి కలలను నిజం చేస్తూ సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసుకున్న లక్ష్మీ ప్రసన్న ప్రిపరేషన్ హాలిడేస్ నిమిత్తం తన స్వగ్రామమైన మునుకుంట్లకు వచ్చింది. అయితే, అదే గ్రామానికి చెందిన రామ్ చరణ్ గత కొంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులు పలుమార్లు రామ్ చరణ్‌ను మందలించినప్పటికీ అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.

శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లక్ష్మీ ప్రసన్న అనుమానాస్పద స్థితిలో దూలానికి ఉరివేసుకుని కనిపించింది. సాయంత్రం ఇంటికి వచ్చిన ఆమె సోదరి ఈ ఘోరాన్ని గమనించి కుటుంబ సభ్యులకు మరియు పోలీసులకు సమాచారం అందించింది. శనివారం ఉదయానికి నిందితుడు రామ్ చరణ్ కూడా గ్రామ సమీపంలోని పొలాల్లో ఉన్న తన తండ్రి నర్సింహ సమాధిపై తన రక్తంతో లక్ష్మీ ప్రసన్న నిక్ నేమ్ అయిన 'చిన్నారి' అనే పేరును రాసి, పక్కనే ఉన్న తాటిచెట్టుకు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.

 శుక్రవారం సాయంత్రం రామ్ చరణ్ మరో వ్యక్తితో కలిసి లక్ష్మీ ప్రసన్న ఇంటికి వెళ్లినట్లు స్థానికులు చెప్తుండటంతో, యువతి మృతి వెనుక హత్య కోణం ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతి తండ్రి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో వార్డు బాయ్‌గా పనిచేస్తుండగా, తల్లి స్వగ్రామంలో కూలీ పనులకు వెళ్తోంది. ఈ ఘటనపై శాలిగౌరారం సీఐ రాజశేఖర్, కట్టంగూర్ ఎస్ఐ రవీందర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Nalgonda MBBS student suicide, Lakshmi Prasanna medical student death, Kattangur Munukuntla news, Ram Charan suicide Nalgonda, Suryapet medical college student, Telangana crime updates, CM Revanth reddy, Telangana goverment