విజయం సాధించిన కోమటిరెడ్డి బ్రదర్స్

 

ఇంకా ఎన్నికలే పూర్తికాలేదు అప్పుడే విజయమేంటి అనుకుంటున్నారా.గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ఎప్పుడు ప్రకటిస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు.ఎట్టకేలకు అభ్యర్థుల జాబితా వచ్చింది.జాబితాతో కోమటిరెడ్డి బ్రదర్స్ ఓ విజయం సాధించారు.కోమటిరెడ్డి బ్రదర్స్ కి నల్గొండ జిల్లాలో మంచి పేరు ఉంది.పార్టీ ఒకే కుటుంబం ఒకే టికెట్ అనే సిద్ధాంతం అమలుచేసినా ఈ ఇద్దరు సోదరులకు మాత్రం మినహాయింపు ఇవ్వాల్సిందే.అయితే వీరిద్దరూ గత కొన్ని రోజులుగా ఎన్నికల్లో పోటీ చేయమని భీష్మించుకు కూర్చున్నారు.నకిరేకల్‌ స్థానాన్ని చిరుమర్తి లింగయ్యకు ఇవ్వాలని పార్టీ అధిష్టానికి కరాఖండిగా తేల్చిచెప్పారు.అయితే జాబితా విడుదల చేయటానికి ప్రయత్నాలు జరుగుతన్న తరుణంలో ఢిల్లీలో మకాం వేసి మరీ లింగయ్యకు టికెట్ ఇప్పించారు.మొత్తానికి కోమటిరెడ్డి బ్రదర్స్ అనుకున్నది పట్టుపట్టి మరీ సాధించారు.నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి,చిగురుమర్తి లింగయ్య నకిరేకల్ స్థానాల నుంచి ఎన్నికల బరిలో నిలవనున్నారు.