Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా!
posted on: Oct 3, 2024 6:15PM

అక్కినేని నాగార్జున మీద, నటి సమంత మీద దారుణమైన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇప్పుడు తీరిగ్గా తాను చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి చేతులు దులుపుకున్నారు. కానీ ఆమె చేసిన దారుణమైన వ్యాఖ్యలు మాత్రం క్షమార్హం కాదని ప్రజలు ముక్తకంఠంతో అంటున్నారు. ఒక మంత్రి హోదాలో వుండి, మహిళ అయి వుండి, తన రాజకీయ అంశాలలో సినిమావాళ్ళని లాగి, దారుణమైన వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ తన పరువు పోగొట్టుకున్నారు. అయితే, పెదవి దాటని మాటకు నువ్వు రాజువి.. పెదవి దాటిన మాటకు నువ్వు బానిసవి అన్నట్టుగా తన నోటి నుంచి వచ్చిన మాటలు కొండా సురేఖని అంత సులభంగా వదిలేలా లేవు. కొండా సురేఖ కామెంట్ల వల్ల పరువు నష్టానికి గురైన అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో గురువారం కొండా సురేఖ మీద పరువునష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. అయితే నాగార్జున కొండా సురేఖను శిక్షించాలని కోరారే తప్ప, డబ్బును డిమాండ్ చేయనట్టు తెలుస్తోంది.


.webp)



