సీమాంధ్రలో టీడీపీ జోరు.. ప్రకాశంలో మూడు మున్సిపాలిటీలు

 

 

 

సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ జోరు మాంచి ఊపు మీద వుంది. సీమాంధ్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అనేక స్థానాల్లో ముందంజలో వున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రకాశం జిల్లాలో కూడా తెలుగుదేశం హవా కొనసాగుతోంది. మూడు మునిసిపాలిటీలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. అద్దంకి, చీమకుర్తి, కనిగిరి మునిసిపాలిటీలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఇక్కడ మునిసిపల్ ఛైర్మన్లుగా తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థులే ఎంపికవుతారు.