జర్మనీ ఉగ్రదాడిపై మోడీ..


జర్మనీలోని మ్యూనిక్‌ నగరంలోని ఒలంపియా షాపింగ్‌మాల్‌లో ఓ దుండగుడు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 9 మంది మృతి చెందగా మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. జర్మనీలో జరిగిన ఈ దాడి చాలా హేయమైనది అని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. మోదీ స‌హా వివిధ దేశాల నేత‌లు ఈ దాడిని ఖండిస్తూ ట్వీట్లు చేశారు.