ముంబై లో జర్నలిస్ట్ పై గ్యాంగ్ రేప్

 

 

 

ముంబై కి చెందిన ఓ మహిళ జర్నలిస్ట్ గురువారం రాత్రి గ్యాంగ్ రేప్ కి గురయింది. ఓ ప్రముఖ పత్రికకు ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న మహిళ జర్నలిస్ట్ అసైన్‌మెంట్‌పై ఆమె మిల్ కాంపౌండుకు వెళ్లింది. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. జస్లోక్ అస్పత్రిలో ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఆమె ప్రాణాలకు ఏ విధమైన ప్రమాదం లేదని తెలుస్తోంది. ఆమెతో పాటు వచ్చిన మగ సహోద్యోగిని దుండగులు కొట్టి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అమ్మాయికి గాయాలయ్యాయని, రక్తం కూడా కారుతోందని, అయితే చికిత్సకు ప్రతిస్పందిస్తోందని వైద్యులు చెబుతున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు 10మంది నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.