ముంబై బ్లాస్ట్ హంతకుడొచ్చాడు
Published on: Thu Apr 10, 2025 12:35PM

2008 ముంబై ఉగ్రదాడి సూత్రదారి తహవూర్ రాణాను అమెరికా అప్పగించింది. ప్రత్యేక విమానంలో రాణా ఇండియాకు బయలు దేరాడు. మరికొద్ది సేపట్లో రాణా భారత్ కు చేరుకునే అవకాశం ఉంది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో రాణాను ముందుగా ఎన్ ఐ ఏ అధికారులకు అప్పగించనున్నారు. అక్కడనుంచి రాణాను తీహార్ జైలుకు అప్పగించనున్నారు. భారత్ లో జరిగిన ఉగ్రదాడుల్లో 26 నవంబర్ 2008 ఉగ్రదాడిని ఎవరూ మర్చిపోలేరు. నిన్న రాత్రి ఏడుగంటల పదినిమిషాలకు ప్రత్యేక విమానంలో అమెరికా నుంచి రాణా బయలు దేరాడు. 17 ఏళ్ల తర్వాత భారత అధికారులు తీసుకొస్తున్నారు. తహవూర్ రాణా ను ఎన్ఐఎన్ అధికారులు కస్టడీలో తీసుకునే అవకాశం ఉంది. ఎన్ ఐ ఏ కార్యాలయంలో ఆయన్ని ప్రశ్నించనున్నారు. తొలుత ముంబై పటియాల కోర్టు జడ్జి ముందు ప్రవేశ పెట్టనున్నారు. భధ్రతా సమస్యల దృష్ట్యా ఆయన్ని ఆన్ లైన్ లో అప్పగించనున్నారు. లష్కర్ ఎ తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన రాణా రాక సందర్బంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా కేంద్రం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచింది. ట్రావెల్ సంస్థను నిర్వహించే రాణా అమెరికన్ ఉగ్రవాది హెడ్లీతో పరిచయమైంది . ఈ పరిచయంతోనే హెడ్లీ ముంబై వచ్చి రెక్కీ నిర్వహించాడు. రాణా వస్తున్న సందర్బంగా తీహార్ జైల్లో భధ్రతను పెంచారు. ముంబై బ్లాస్ట్ లో రాణా 160 మందిని పొట్టన బెట్టుకున్నాడు. ఈ మారణ హోమంలో పాల్గొన్న మరో టెర్రరిస్ట్ కసబ్ కు ఇప్పటికే ఉరిశిక్ష అమలైంది. కసబ్ తరహా రాణాకు ఉరిశిక్ష అమలు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోంది.


