మేమంతా ఒక్కటే.. సమావేశానికి రాని అఖిలేష్..


యూపీ సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం కుటుంబంలో ఉన్నకుటుంబ విబేధాలు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ములాయం తనయుడు, ముఖ్యమంత్రి అయిన అఖిలేష్ యాదవ్ కి.. ఆయన బాబాయి అయిన శివపాల్ యాదవ్ కి మధ్య ఇప్పటికే పలు సందర్భాల్లో ఈ విషయం అర్థమైంది. అయితే ఎన్నిసార్లు గొడవలు బయటకి కనిపించినా ములాయం మాత్రం మా మధ్య అలాంటివి ఏం లేవు అని చెప్పుకొస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ రోజు మీడియా సమావేశంలో పాల్గొన్న ములాయం.. మా కుటుంబం అంతా కలిసే ఉంది.. మా లక్ష్యమంతా ఒక్కటే.. మేమంతా ఒకే ఫ్యామిలీ ఒకే పార్టీ అని అన్నారు. పార్టీ ఇమేజ్ ను అఖిలేష్ మార్చారు.. సీఎంగా అఖిలేషే కొనసాగుతారు అని స్పష్టం చేశారు. అంతేకాదు ప్రతి విషయంలో అమర్ సింగ్ ను ఎందుకు తీసుకొస్తారు.. బయటివాళ్లే పార్టీలో గొడవలు సృష్టిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అంతా బాగానే ఉన్నా... ములాయం మేమంతా ఒకటే అని చెబుతున్నా.. అఖిలేష్ మీడియా సమావేశానికి రాకపోవడం గమనార్హం.