మేము ఆరోగ్యంగా ఉన్నాము.. తప్పుడు సంకేతాలు ఇవ్వద్దు..

కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం ఆయన భార్యతో కలిసి చేపట్టిన నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. దీంతో ముద్రగడకు, ఆయన సతీమణికి వైద్యలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ముద్రగడ మాత్రం తమ ఆరోగ్యం గురించి ఎలాంటి సంకేతాలు ఇవ్వద్దని.. అలా చేయడం వల్ల అభిమానులు ఆందోళన చెందుతారని వైద్యులకు సూచించారు. అంతేకాదు మేము పూర్తి ఆరోగ్యంతో ఉన్నాము.. నాభార్యకు ఉపవాసాలు చేయడం అలవాటే.. మేము భోజనం చేయకపోయినా ఆరోగ్యంగానే అంటామని చెపుతున్నారు. దీంతో చేసేది లేక వైద్యులు కూడా వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఏం చెప్పకుండానే వెళ్లినట్టు తెలుస్తోంది.