TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎంపీతో క్రికెటర్‌ పెళ్లి...డేట్ ఫిక్స్?

Published on: Sun Jun 1, 2025 3:01PM

 

 

సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్‌ టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ రింకూ సింగ్‌ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.  లఖ్‌నవూలోని ఓ లగ్జరీ హోటల్‌లో వీరి నిశ్చితార్థం ఉండనున్నట్లు తెలుస్తోంది. రింకు, ప్రియకు ఏడాది ముందు నుంచే పరిచయం ఉందని గతంలో ప్రియ తండ్రి, ఎమ్మెల్యే తుపాని సరోజ్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని.. మ్యారేజ్‌కి ఇరు కుటుంబాలు అంగీకరించాయని తెలిపారు. యూపీలోని మచిలీషహర్‌ లోక్ సభ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరపున పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 25 ఏళ్ల ప్రియ గతంలో సుప్రీం కోర్టు న్యాయవాదిగా పనిచేశారు. టీమ్‌ఇండియాలో యువ క్రికెటర్‌గా రింకు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరి వివాహంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.