మరో అమ్మ దారుణం

 

మరో అమ్మ దారుణానికి ఒడిగట్టింది. అత్తింటి వేధింపులు తాళలేక ఒక మహిళ ఆదివారం ఉదయం తన 11 నెలల చిన్నారితో సహా కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. కండ్రిక శివారు అల్లపల్లివారి పాలెం గ్రామానికి చెందిన యువతి వెంకట రమణ (20)కి ఏడాదిన్నర క్రితం నక్కారాజుతో వివాహం జరిగింది. ఇటవలి కాలంలో ఆమె భర్త, అత్తమామలు వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పుట్టింటికి వచ్చిన ఆమె శనివారం సాయంత్రం తన కుమార్తెతో సహా ఇంట్లోంచి బయటకి వెళ్ళిపోయింది. ఆమె కోసం వెతుకుతూ వుండగా బొబ్బర్లంక - ముక్కామల పంట కాలువలో పలివెల వంతెన సమీపం వద్ద తల్లీ కూతుళ్ళ మృతదేహాలు కనిపించాయి.