మంచు బాబు.. చెంప చెల్లుమనిపించాడట...!
Published on: Thu Nov 14, 2013 10:56AM

మంచు కుటుంబం మొత్తం కలిసి నటిస్తున్న తాజా చిత్రం "పాండవులు పాండవులు తుమ్మెదా". ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.అయితే ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఒక పల్లెటూరి వ్యక్తి వచ్చి అనుమతి లేకుండా చిత్ర షూటింగ్ ను చూసాడని, దాంతో మోహన్ బాబుకి కోపం వచ్చి అతని చెంప చెల్లుమనిపించాడని తెలిసింది. అంతే కాకుండా అలా చూసినందుకు 500 రూపాయలు చెల్లించమని అడిగినట్లుగా సమాచారం. ఎందుకంటే ఇటీవలే పవన్ "అత్తారింటికి దారేది" సినిమా విడుదలకు ముందే పైరసీ కావడం వల్ల మోహన్ బాబు చాలా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాడు. ఎవరు కూడా సెల్ ఫోన్ లు వాడరాదని చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు మోహన్ బాబు.


