నేపాల్ పార్లమెంటులో మోడీ ప్రసంగం

 

ఆగస్టు మాసంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు నేపాల్ దేశంలో పర్యటించనున్నారు. ఆగస్టు 4న మోడీ నేపాల్ పార్లమెంట్ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ నేపాల్ పార్లమెంట్లో ప్రసంగిస్తారు. నేపాల్ పర్యటన సందర్భంగా అక్కడి ప్రసిద్ధ పశుపతి ఆలయాన్ని మోడీ సందర్శించనున్నారు. హిందువులు పవిత్రంగా భావించే ఈ ఆలయంలో శివుడు కొలువైఉన్నాడు. మోడీ రాకను పురస్కరించుకుని పశుపతి ఆలయం పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తున్నారు. మోడీ పర్యటనలో ఇరు దేశాల నాయకులు కీలక అంశాలపై చర్చించనున్నారు.