TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గిర్ అభయారణ్యంలో మోడీ!

Published on: Mon Mar 3, 2025 4:04PM

ప్రపంచ వన్యప్రాణుల దినం సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ లోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో పర్యటించారు. గుజరాత్ లోని జునాగఢ్ లో ఈ అభయారణ్యం ఉంది. కొందరు మంత్రులు, అటవీ శాఖ సీనియర్ అధికారులతో కలిసి ఈ అభయారణ్యంలో ప్రధాని మోడీ పర్యటించారు.

 ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ అభయారణ్యంలో స్వేచ్ఛగా తిరుగాడుతున్న, విశ్రాంతి తీసుకుంటున్న సింహాల ఫొటోలను స్వయంగా తీశారు. ఆ ఫొటోలను  తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అవి వెంటనే వైరల్ అయ్యాయి.