TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇక హై-కమీషనర్ల వంతు

Published on: Fri Aug 8, 2014 7:12PM

 

కేంద్రంలో ప్రభుత్వాలు మారగానే గవర్నర్లను బదిలీలు చేయడం లేదా వారి స్థానంలో తమకు అనుకూలురయిన వ్యక్తులను నియమించుకోవడం మామూలే. మోడీ ప్రభుత్వం కూడా అదేపని చేసింది. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి చెందిన షీలా దీక్షిత్, రోశయ్య, మార్గరెట్ ఆల్వా వంటి వారినే కాకుండా కాంగ్రెస్ హయంలో గవర్నర్లుగా నియమింపబడిన నరసింహన్ వంటి అనేకమందిని నేటికీ కొనసాగిస్తూనే ఉంది. గవర్నర్ల వ్యవహారాన్ని చక్క బెట్టిన మోడీ ప్రభుత్వం విదేశాలలో భారత హైకమీషనర్లుగా సేవలందిస్తున్న వారిపై దృష్టి పెట్టింది. త్వరలోనే వారి స్థానాలలో ప్రభుత్వానికి అనుకూలురయిన అధికారులను నియమించే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం బ్రిటన్, కెనడా, నార్వే దేశాలలో భారత హైకమీషనర్లుగా చేస్తున్న రంజన్ మతై, నిర్మల్ కుమార్ వర్మమరియు నార్మన్ అనిల్ కుమార్ బ్రోనీల స్థానంలో కొత్త వారిని నియమమించాలని ప్రధాని మోడీ భావిస్తున్నట్లు సమాచారం. మోడీకి అత్యంత సన్నిహితులయిన స్వపన్ దాస్ గుప్తా మరియు బ్రహ్మ చెలానీలను బ్రిటన్ మరియు కెనడా దేశాలకు భారత హైకమీషనర్లుగా నియమించాలని మోడీ భావిస్తున్నట్లు సమాచారం. బహుశః త్వరలోనే ఈ వ్యవహారం కూడా ఒక కొలిక్కి రావచ్చును.