TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఢిల్లీ నుంచి యూర‌ప్‌లో కారు న‌డిపిన మోదీ...5జీ మ‌హిమ‌!

Published on: Sat Oct 1, 2022 1:52PM

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ మూడురోజుల‌పాటు జ‌రిగే మొబైల్ ఇండియా  కాంగ్రెస్ 2022 ను  ప్రధాని శ‌ని వారం ఆరంభించారు.  అందులో భాగంగా  5జీ  టెలిక‌మ్యూనికేష‌న్ సేవ‌లు ఆరంభించారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఎరిక్‌స‌న్ బూత్ నుంచి 5జీ టెక్నాల‌జీ ఉప‌యోగించి స్వీడ‌న్‌లో ఉన్న కారును న‌డిపారు.  

రిమోట్ కంట్రోల్ కారులో స్టీరింగ్ చేస్తూ ప్ర‌ధాని ఉన్న ఫోటో ను కేంద్ర వాణిజ్య‌శాఖ మంత్రి పీయూష్ గో యెల్ ట్వీట్ చేశారు. భార‌త మొబైల్ కాంగ్రెస్ 2022 ఆసియాలోకెల్లా అతి పెద్ద డిజిట‌ల్ టెక్నాల‌జీ వేది క‌ల్లో ఒక‌టిగా పేర్కొన్నారు. కాగా, న్యూఢిల్లీ ప్ర‌గ‌తీమైదాన్‌లో ఆరంభ‌మైన స‌ద‌స్సు ఈ నెల 4వ తేదీ వ‌ర‌కూ జ‌రుగు తుంది. 

రిమోట్‌గా కారును నడపడమే కాకుండా, కార్యక్రమంలో ప్రదర్శించిన  అనేక ఇతర సాంకేతిక ఆవిష్క రణలను కూడా మోదీ ప్ర‌యోగించారు. 5G టెక్నాలజీ మొబైల్ కమ్యూనికేషన్, డేటా ట్రాన్స్‌మిషన్ కోసం 4జీ కంటే చాలా వేగవంతమైన వేగాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. 5G రోల్ అవుట్ ఇతర ప్రయోజ నాలతోపాటు వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ను వేగవంతం చేస్తుం దని నమ్ముతారు. 5జీ మొదటి దశ 13 నగరాల్లో ప్రారంభించబడుతుంది. 2024 నాటికి దేశవ్యాప్తంగా పూర్తి  5G  కవరేజీ  పూర్త వుతుంది.