ఇలాంటి వాళ్లా మోడీకి వారసులు...?

 

ప్రధాని మోడీ ఎంత హితబోధ చేస్తున్నా బీజేపీ నేతలు మాత్రం తమ నోటిని మాత్రం హద్దుల్లో పెట్టుకోకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు. ఇటీవల త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్, గుజరాత్‌ అసెంబ్లీ స్పీకర్‌ రాజేంద్ర త్రివేది సంచలన వ్యాఖ్యలు  పెద్ద దుమారమే రేపుతున్నాయి.తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. ఇక హిందూ భావ‌జాల నేప‌థ్య‌మున్న బీజేపీ నేత‌లు ప్ర‌స్తుత విష‌యాల‌న్నింటినీ పురాణాల‌తో ముడిపెట్టి మాట్లాడుతుండటంతో... బీజేపీపై విపక్ష నేతలు విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి మాట్లాడుతూ, ఇలాంటి వాళ్లా మోదీకి వారసులు? అంటూ ప్రశ్నించారు. వీళ్లా ప్రజలను పాలించేది? అంటూ మండిపడ్డారు. సమాజానికి వీళ్లు ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు..ఒకరేమో గూగుల్ ను నారదుడితో పోలుస్తూ మాట్లాడతారని, మరొకరేమో మహాభారత కాలంలోనే ఇంటర్నెట్ ఉందని అంటారని, యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉద్యోగాలేం చేస్తారు.. పాన్ షాపులు పెట్టుకుని బతకాలని సూచిస్తారని ఎద్దేవా చేశారు. వీళ్లకు ఉన్న జ్ఞానం ఇంతేనేమో అని అన్నారు. వీరి వివాదాస్పద వ్యాఖ్యలు ఇంతటితో ఆగబోవని చెప్పారు. మరి ఇప్పటికైనా బీజేపీ నేతలు ఏం మాట్లాతున్నామో.. అని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని కాస్త నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. లేకపోతే ఇలానే కంటిన్యూ అయితే మోడీపై ఉన్న వ్యతిరేకత ఇంకా పెరిగే అవకాశం ఉంటది....