మోడీపై ఫన్నీ కామెంట్లు... కెమెరాలు ఎక్కడున్నాయో మోడీకి బాగా తెలుసు..!
posted on Nov 30, 2017 3:31PM
హైదరాబాద్ గ్లోబల్ సమ్మిట్ లో ప్రధాన మంత్రి మోడీ హాజరైన సంగతి తెలిసిందే. మెట్రో ప్రారంభోత్సవానికి హాజరైన మోడీ.. అక్కడి నుండి నేరుగా గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఇవాంకా ట్రంప్తో కలిసి ఆయన దిగిన ఫొటో ఒకటి ఇప్పుడు ట్విట్టర్లో వైరల్గా మారింది. ఇందులో అందరూ సభావేదిక వైపు చూస్తుంటే మోదీ మాత్రం కెమెరా వైపు చూస్తున్నారు. అంతే ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాదు కొంతమంది నెటిజన్లు ఈ ఫొటోను చూసి మోడీపై కామెంట్లు చేసుకుంటున్నారు. 'కెమెరాలు ఎక్కడున్నాయో గుర్తుపట్టడంలో మోదీ దిట్ట'.. 'కెమెరాలు మనుషుల్ని కనిపెడితే... మోదీ కెమెరాలను గుర్తుపడతారు' అని కామెంట్లు చేసుకుంటున్నారు. ఈ ఫొటోనే కాదు.. 'రోబో మిత్ర' మోదీ పేరు చెప్పడాన్ని, ఇవాంకా ట్రంప్తో డిన్నర్ చేస్తున్నపుడు తీసినప్పటి ఫొటోలకు కూడా నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.