యాదవరెడ్డిని కాంగ్రెస్ నుంచి గెంటేశారు!

 

కాంగ్రెస్ పార్టీ విప్‌ను ధిక్కరించిన జడ్పీటీసీ, ఎమ్మెల్సీ కె. యాదవరెడ్డిని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. యాదవరెడ్డిని ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ పీసీసీ ప్రకటించింది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌తో యాదవరెడ్డి చేతులు కలిపారు. ఎమ్మెల్సీగా కూడా అయిన ఆయన శాసనమండలి ఛైర్మన్ ఎన్నికల్లోను టీఆర్‌ఎస్ అభ్యర్థికే మద్దతు పలికారు. దీంతో పార్టీ విప్‌ను ఉల్లంఘించిన ఆయనపై అనర్హత వేటు వేయాలని డీసీసీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై బదులివ్వాలని కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కేంద్రమాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి శిష్యుడిగా కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరించిన యాదవరెడ్డి ఏఐసీసీ సభ్యుడు కూడా. ఈ క్రమంలోనే ఆయనపై బహిష్కరణాస్త్రం ప్రయోగించడం ఆలస్యమైందని కాంగ్రెస్ పార్టీవర్గాలు చెబుతున్నారు.