TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కవిత మరో షర్మిల కాబోతోంది..ఎంపీ షాకింగ్ కామెంట్స్

Published on: Fri May 23, 2025 3:05PM

 

 

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉత్తరం రాయించారేమోనని ఆయన అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కవిత మరో షర్మిల కాబోతోంది అని హాట్ కామెంట్స్ చేశారు. ఇంతకు కవిత రాసిన లేఖ రాజకీయ పంచాయితీనా.. లేక ఆస్తుల పంచాయితీనా అని ప్రశ్నించారు. తన వారసుడు కేటీఆరేనని ప్లీనరీలో కేసీఆర్ చెప్పాకనే చెప్పారని ఎంపీ తెలిపారు. అందుకే ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారేమే అని ఆయన తెలిపారు. పార్టీ నుంచి కవితను కట్టుబట్టలతో బయటకు పంపేందుకు కేటీఆర్‌తో పాటు హరీశ్ రావు ఒక్కటయ్యారని ఆరోపించారు. కవిత హస్తం పార్టీలోకి వెళ్లే ఛాన్స్ ఉందని రఘునందన్ అన్నారు.. ఆమె వెంట ఉండి అంతా నడిపిస్తోంది పాత బిజినెస్ పార్ట్‌నర్ సీఎం రేవంత్ రెడ్డి అని షాకింగ్ కామెంట్స్ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విషయంలో కవిత మాట్లాడినవి వాస్తవాలేని ఆయన అన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడుతోందన్నారు.ఎవరు ఏం చేసినా.. తెలంగాణలో రాబోయేది డబుల్ ఇంజన్ సర్కారు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు