తన గుండు పై రోజా ఫైర్... వాళ్ల పెళ్లాలకు గుండ్లు కొట్టేలేమా..?

 

నంద్యాల ఉపఎన్నిక ఓటమి తరువాత వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా కాస్త సైలెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. నంద్యాల ఉపఎన్నిక ఓటమికి ఓ రకంగా రోజానే కారణమని... పార్టీ నేతలే అనడంతో ఆమె కాస్త సెలైంట్ అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి మీడియాముందుకు వచ్చిన ఆమె.. మరోసారి తన నోటికి పని చెప్పారు. ఈమధ్య రోజా గుండుతో ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై ఓ ఇంటర్వ్యూలో.. రోజాకు గుండుకొట్టినట్టు ఉన్న ఫోటోను చూపించి...ఇలాంటి ఫోటోలు చూసినప్పుడు ఏమనిపిస్తుంటుందని ప్రశ్నించాడు. ఇక ఫొటో చూసి తీవ్ర ఆగ్రహానికి గురైన రోజా....వాడెవడో కనిపిస్తే చెప్పుతో కొట్టాలని ఉందని అన్నారు. ఈ ఫోటోలు కేవలం తనకు మాత్రమే పెట్టలేదని, ఇలాంటి ఫోటోలు చాలా మంది వైఎస్సార్సీపీ నేతల ఫోటోలకు పెట్టాడని మండిపడ్డారు. ఏం మేము తలచుకుంటే టీడీపీ నేతల పెళ్లాలకు గుండ్లు కొట్టేలా మార్ఫింగ్ ఫోటోలు పెట్టలేమా? అని ఆమె ప్రశ్నించారు. వాడెవడో ఒక అబ్బాఅమ్మకి పుట్టి ఉంటే ఇలాంటి పని చేస్తాడా?...వాడిని ఏం చెయ్యాలి? అని ఆమె ప్రశ్నించారు.