ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు తీవ్ర అస్వస్థత

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సాయంత్రం శంషాబాద్‌లో ఓ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గోనేందుకు అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే ప్రారంభోత్సవం జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్సందించిన ఎమ్మెల్యే అనుచరులు ప్రకాశ్‌గౌడ్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యుల సలహా మేరకు నిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకొన్న మంత్రి మహేందర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఎమ్మెల్యేను పరామర్శించారు.