బాలకృష్ణ పీఎ తొలగింపు...

 

హిందూపురంలో టీడీపీ రాజకీయాలు తారాస్ధాయికి చేరాయి. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఎ శేఖర్‌ తీరును వ్యతిరేకిస్తూ హిందూపురంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  పీఏ శేఖర్‌ రెండున్నర ఏళ్లుగా నియోజకవర్గంలో అవినీతికి పాల్పడుతూ పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తూ అక్రమార్జనకు తెర లేపారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు శేఖ‌ర్‌ను తొలగించాల‌ని వారు చంద్రబాబును సైతం కోరినట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై స్పందించిన బాలకృష్ణ సైతం తెదేపా క్రమశిక్షణ కలిగిన పార్టీ అని.. దానిని ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు బాలకృష్ణ, నారా లోకేశ్ ఇద్దరూ చంద్రబాబుతో చర్చించినట్టు సమాచారం. ఈ సమావేశంలో శేఖర్‌ను విధుల నుంచి తొలగించాలని చంద్రబాబు నిర్ణయించారు.