10 వేల కోట్ల భూ కుంభకోణంపై సీఐడీ విచారణకు కేసీఆర్ ఆదేశం

హైదరాబాద్‌ మియాపూర్‌లో అక్రమ మార్గాల ద్వారా కోట్ల విలువ చేసే భూమిని దారి మళ్లించిన కుంభకోణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూ కుంభకోణంపై ఇవాళ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల పనితీరుపై సీరియస్ అయ్యారు. మరో ఆలోచన లేకుండా వెంటనే సీఐడీ విచారణకు ఆదేశించారు. కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని..నిందితులు ఎంతటివారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనికి తోడు ఇంతటి కుంభకోణానికి కారణమైన ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకును విధానాన్ని రద్దు చేశారు.