TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ 

Published on: Thu Apr 3, 2025 5:08PM

అరెస్ట్ అయితే బెయిల్ కోసం కోర్టునాశ్రయించడం సరైన న్యాయ ప్రక్రియ. కానీ వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి మాత్రం  మద్యం కుంభ కోణం కేసులో అరెస్ట్ కాకముందే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టునాశ్రయించి ఎదురు దెబ్బతిన్నారు. వైకాపా ఐదేళ్ల పాలనలో చీప్ లిక్కర్ ఏరులై పారింది. ప్రభుత్వమే ఈ వ్యాపారం చేసి అనేక ఆరోపణలు ఎదుర్కొంది. కూటమి ప్రభుత్వం వచ్చాక అక్రమాలకు పాల్పడిన వారిపై కొరడా జులిపించింది. ఇందులో భాగంగా వైకాపా ఎంపీ మిథున్ రెడ్డిపై గతేడాది సెప్టెంబర్ 23న సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కుంభ కోణంలో వైకాపా ఎంపి మిథున్ రెడ్డి పాత్రను కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉండటంతో మిథున్ రెడ్డి హైకోర్టు నాశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు  గత నెల 24న ముగియడంతో తీర్పును ఏప్రిల్ మూడుకు రిజర్వ్ చేసింది. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ గురువారం తీర్పు చెప్పింది.