ఆ విమానాన్ని మర్చిపోవాల్సిందేనా?

 

 

 

మలేసియాకి చెందిన ఎంహెచ్ 370 విమానం హిందూ మహాసముద్రంలో అదృశ్యమై నెలరోజులు కావొస్తోంది. విమానంతోపాటు విమానంలో ప్రయాణిస్తున్న 239 ప్రయాణికుల జాద తెలియడం లేదు. మలేసియాతోపాటు అమెరికా, చైనా తదితర దేశాలు ఎంత వెతికినా విమానం ఎక్కడుందో, ఏమైందో ఎవరూ పసిగట్టలేకపోయారు. వచ్చే సోమవారం లోపు ఈ విమానం ఎక్కడుందో కనుక్కోలేకపోతే ఇక ఆ విమానాన్ని మరచిపోవాల్సిందేనని మలేసియాకి చెందిన ఒక అధికారి వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఆరోజుతో విమానంలోని బ్లాక్ బాక్స్ సిగ్నల్స్ పంపడం ఆపేస్తుంది. దాదాపు నెల రోజులుగా విమానాలు, హెలికాప్టర్లు, స్టీమర్లతో వెతికారు. మొన్నీమధ్య సబ్ మెరైన్లు కూడా రంగంలోకి దిగాయి. కానీ, ఇంతవరకు ఈ విమానం జాడ తెలియలేదు. అయితే, విమానం జాడ కనుక్కునేవరకూ తాము విశ్రాంతి తీసుకునే ప్రసక్తే లేదని మలేసియా ప్రధానమంత్రి ప్రకటించారు.