లాలూ కుమార్తెకు మళ్లీ నోటీసులు...

 

లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే లాలూ కుటుంబంపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో సీబీఐ దాడులు కూడా జరిగాయి. అంతేకాదు ఈ ఆరోపణల నేపథ్యంలో కొడుకు పదవికి గండి పడింది. ఇక ఇప్పటికే రెండు మూడు సార్లు లాలూ కూతురు సమన్లు అందుకున్నది. ఇప్పుడు తాజాగా మరోసారి మీసా భారతికి ఆదాయ పన్ను శాఖ సమన్లు జారీచేసింది. మీసా భారతి, అమె భర్త శైలేష్‌ కుమార్‌లు వచ్చే సోమవారంలోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. డొల్ల కంపెనీలు ఏర్పాటుచేసి అక్రమాస్తులు కూడబెట్టిన వ్యవహారంలో మీసా, ఆమె భర్త శైలేష్‌లపై క్రిమినల్‌ కేసులు నమోదుచేసే అవకాశం ఉన్నట్టు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.