ఢిల్లీ ఇస్తమాకు వెళ్లారా? వెంటనే మీ సమాచారం ఇవ్వండి!
posted on Mar 31, 2020 4:10PM
మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ మొహమ్మద్ ఇలియాస్ రిజ్వీ విజ్ఞప్తి.
మూడు రోజుల ఇస్తమా కోసం ఢిల్లీ మర్కజ్కు వెళ్లి తిరిగి వచ్చిన వారు, వారిని కలిసిన వ్యక్తుల సమాచారం వెంటనే ఇవ్వాలని మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ మొహమ్మద్ ఇలియాస్ రిజ్వీ విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ మర్కజ్లో జరిగిన అంతర్జాతీయ ఇస్తమాలో పాల్గొని ఆంధ్రప్రదేశ్కు తిరిగి వచ్చిన వారందరూ తమ సమాచారాన్ని స్వచ్ఛందంగా మీ జిల్లా యంత్రాగానికి తెలపాలని రిజ్వీ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
తిరిగివచ్చిన వారిలో కొంత మందికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించినందువల్ల మీరు, మీతో పాటు మిమ్మల్ని కలిసిన వ్యక్తులు మీ కుటుంబ సభ్యులు, వారిని కలసిన వ్యక్తులు అందరూ హోమ్ ఐసోలేషన్ లో కి వెళ్లాలని మైనార్టీ సంక్షేమ శాఖా ప్రిన్సిపల్ సెక్రటరీ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో జరిగిన జమాత్ లో పాల్గొన్న వారందరూ బాధ్యతగా వ్యవహరించి క్వారంటైన్ లో వుండాలని ఆయన సూచించారు.