TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంత్రి లోకేష్ 88వ ప్రజాదర్బార్... కార్యకర్తలకు భరోసా

Published on: Tue Apr 14, 2026 6:08PM

 

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పార్టీ కార్యాలయానికి వచ్చిన సామాన్యులు, టీడీపీ కార్యకర్తలను మంత్రి ఆప్యాయంగా పలకలించారు. వివిధ సమస్యలపై వారి నుంచి వినతులు స్వీకరించారు. నంద్యాల జిల్లా జూపాడు మండలం 35 బొల్లవరం, తాటిపాడు, భాస్కరాపురం గ్రామాల పరిధిలోని సుమారు 72 ఎకరాలను నిషేధిత భూముల జాబితా 22(ఏ)1(సి)లో చేర్చారని, విచారించి ఆయా భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. 

ఆయా భూములు వారసత్వంగా తమకు సంక్రమించాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మంది ఉన్న టూవీలర్స్ మెకానిక్ లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ టూవీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. రాష్ట్రంలో ముదిరాజ్ సామాజికవర్గానికి ప్రత్యేకంగా కార్పోరేషన్ ఏర్పాటుచేయాలని ముదిరాజ్ సంఘం ఆంధ్రపదేశ్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తున్న విజయ్ కలాంకు మంత్రి లోకేష్ అభినందన

అంతకుముందు డ్రగ్స్, ఇతర మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ మిషన్ దండి మార్చ్ 2.O పేరుతో తిరుపతి నుంచి విశాఖ వరకు వెయ్యి కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేపట్టిన వైబ్రంట్స్ ఆఫ్ కలామ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు విజయ్ కలాంను పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి మంత్రి అభినందించారు. ఇప్పటివరకు విజయ్ కలాం 549 కి.మీల సైకిల్ యాత్రను పూర్తిచేశారు.