శ్రీతేజ్ ను పరామర్శించిన మంత్రి కోమటి రెడ్డి
Published on: Sat Dec 21, 2024 5:08PM
సంధ్య థియేటర్ ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అగ్రహం చేసిన కొద్దిసేపట్లో మంత్రి కోమటిరెడ్డి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు. తొక్కిసలాటలో శ్రీతేజ్ బ్రెయిన్ డామేజ్ జరిగి ఆక్సిజన్ అందలేదు. దీంతో శ్రీతేజ్ స్పృహ కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనకు కారణమైన అల్లు అర్జున్ ఇంతవరకు పరామర్శించలేదు. కానీ మంత్రి కోమటి రెడ్డి శనివారం కిమ్స్ చేరుకుని బాధిత కుటుంబానికి 25 లక్షల చెక్కును అందజేశారు. బెనిఫిట్స్ పోలు తెలంగాణ వ్యాప్తంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.


