ఏపీలో మరో మంత్రికి కరోనా

ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు ఉధృతమౌతోంది. తాజాగా సీఎం జగన్ క్యాబినెట్ లోని విద్యుత్‌, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆయనకు తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొద్ది రోజులుగా స్వల్ప జ్వరంతో బాధపడుతున్న బాలినేని శ్రీనివాసరెడ్డి కరోనా టెస్ట్ చేయించుకోగా మొదట్లో ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చింది. అయితే నిన్న మరోసారి కరోనా పరీక్షలు చేయించుకున్న బాలినేనికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన వెంటనే చికిత్స కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా కు చెందిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో వివిధ ప్రయివేట్ హాస్పిటల్స్ లో చేరి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.