జగన్‌... నోరు పారేసుకోకు...

 

 

 

స్పీకర్‌ను ఉద్ధేశ్యించి జగన్‌ చేసిన వ్యాఖ్యల్ని మంత్రి బాలరాజు తీవ్రంగా ఖండిరచారు. రాజ్యాంగ వ్యవస్థనే కించపరిచే విధంగా జగన్‌ మాట్లాడారనీ, జగన్‌ అధికారం కోసమే ఇదంతా చేస్తున్నారని అందరికీ తెలుసనీ ఆయన ఎద్దేవా చేశారు. అయితే అధికారంలోకి వచ్చాక కూడా ఇదే పంథా అనుసరిస్తారా? అనేది జగన్‌ తేల్చిచెప్పాలన్నారు. మాట్లాడే హక్కుందని అన్‌పార్లమెంటరీ భాష మాట్లాడడం ప్రజాస్వామ్యవ్యవస్థల మీద గౌరవం ఉన్నవారు చేయరని ఆయన స్పష్టం చేశారు. దీనిపై జగన్‌ను అసెంబ్లీకి పిలిపించి వివరణ అడగాలన్నారు. మరోవైపు తెలంగాణనేతలు సైతం జగన్‌పై తీవ్రస్తాయిలో మండిపడ్డారు. జగన్‌ ఓ మూర్ఖుడని ఎం.పి గుత్తా సుఖేందర్‌రెడ్డి తిట్టిపోశారు. స్పీకర్‌పై వ్యాఖ్యలు జగన్‌ ఫ్యూడల్‌ మనస్తత్వానికి నిదర్శమన్నారు. స్పీకర్‌పై జగన్‌ చేసిన విమర్శల్ని ఖండిరచిన ప్రభుత్వ ఛీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి... అసెంబ్లీ సమావేశాల్లో ప్రివిలేజ్‌ మోషన్‌ ఇస్తామన్నారు.