లగడపాటి సర్వే నమ్మితే సర్వ నాశనం: టీడీపీ మంత్రి
posted on May 21, 2019 3:22PM
ఏపీలో మళ్ళీ టీడీపీనే అధికారంలోకి వస్తుందన్న లగడపాటి రాజగోపాల్ సర్వేతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో టీడీపీ నేత, మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల నాడి తెలిసిన వాడు ఎగ్జిట్ పోల్ చేయాలి తప్ప, అది తెలియని వాడు సర్వే చేస్తే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ సర్వేలు చేయడం వల్ల ప్రమాదం ఉందన్నారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై లగడపాటి రాజగోపాల్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ కారణంగా పందేలు కాసిన వాళ్లు కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారని విమర్శించారు. లగడపాటి సర్వేతో ఎంతో మంది వీధినపడ్డారని వ్యాఖ్యానించారు. లగడపాటి మాట నమ్మి సర్వనాశనం అయిపోయామని ఇటీవలే హైదరాబాద్ లో పెళ్లికి వెళితే అక్కడికి వచ్చిన వాళ్లలో కొంతమంది తనకు చెప్పారని అయ్యన్నపాత్రుడు అన్నారు.