టిడిపి పై సంచలన వ్యాఖ్యలు చేసిన అనిల్ కుమార్ యాదవ్...


ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ఆగిపోయిందని రకరకాలుగా మట్లాడారని, పోలవరం మీరు చెప్పినదానికంటే ముందే పూర్తి చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని, టిడీపీని మూసేస్తారా అని యాదవ్ ప్రశ్నించారు. తమ బండారం బయటపడుతుందని టిడిపికి భయం పుట్టిందని అన్నారు. రాష్ట్రానికి ఆదాయం చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి జగన్ ముందుకెళ్తున్నారు అని తెలిపారు.

పోలవరం రివర్స్ టెండరింగ్ తో 800 కోట్లు ఆదా చేశామని తెలిపారు. పోలవరం అనేది వైయస్సార్ మేనిఫెస్టోలో ప్రధాన ఎజెండా అని 25,000 కుటుంబాలను ఆర్ అండ్ ఆర్ తో రీహాబీరేట్ చేయటమే కాకుండా నవంబర్ నుంచి పనులు మొదలు పెడతామని రెండు సంవత్సరాల్లో పోలవరాన్ని నిర్మించి తీరుతామని చెప్పారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. మొన్నటివరకు వర్షాల కారణంగా పోలవరం పనులు చేయలేకపోయామని తెలిపారు. పోలవరం రివర్స్ టెండరింగ్ వేసినప్పుడు అందరికీ ఆహ్వానముంటుందనీ,

నవయుగ కాంట్రాక్టర్లు మంచిగా చేస్తున్నప్పుడు టెండర్ విధానంలోకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని చెప్పి ప్రజల్లోకి ఒక అబద్ద ప్రచారాన్ని బదిలీ చేస్తున్నారని, పాత డిజైన్ ఏదైతే ఉందో ఆ విధంగానే పోలవరం ఉంటుందని తెలిపారు. టిడిపి అక్రమంగా ప్రజల డబ్బును దోచుకుంటుందనీ, టిడిపి చేపట్టిన అన్ని ప్రోజెక్టులపై రివర్స్ టెండరింగ్ లకు వెళతామని ప్రజల డబ్బుని ఆదా చేస్తామని తెలిపారు.