TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజులకు ఏపీ కేబినెట్ నిర్ణయం

Published on: Thu Mar 26, 2026 4:43PM

 

యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా సాకారం చేస్తున్నారు యువనేత నారా లోకేష్. తాము కులవృత్తి చేసుకుని జీవనోపాధి పొందేందుకు ప్రభుత్వ కొండ పోరంబోకు భూముల్లో మైనింగ్ లీజులు ఇవ్వాల్సిందిగా పాదయాత్ర సమయంలో వడ్డెర సోదరులు మంత్రి లోకేష్‌కు విన్నవించారు. వారికి ఇచ్చిన మాట ప్రకారం వడ్డెరలకు మైనింగ్ లీజులు కేటాయించే అంశాన్ని మంత్రి లోకేష్ తాజాగా కేబినెట్ ముందుకు తెచ్చారు. వడ్డెర సోదరుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను పెంచడానికి వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజులను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. 

ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి విధివిధానాలతో త్వరలోనే ప్రభుత్వం జీవో జారీ చేయనుంది. యువగళం పాదయాత్ర సమయంలో యువనేత లోకేష్ ప్రతిరోజూ వివిధ సామాజిక వర్గాల ప్రజలతో సమావేశమై వారి మనోగతాన్ని తెలుసుకున్నారు. ఆ సమయంలో వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మాట నిలబెట్టుకుంటున్నారు. గత వైసీపీ వివిధ సామాజికవర్గాలను కేవలం ఎన్నికల్లో ఓట్లకోసం మాత్రమే ఉపయోగించుకొని, అవసరం తీరాక గాలికొదిలేసింది. అటువంటి ఓటుబ్యాంకు రాజకీయాలకు స్వస్తిపలుకుతూ వివిధ సామాజిక వర్గాల మనోభీష్టాన్ని నెరవేరుస్తున్నారు రాష్ట్రమంత్రి, యువనేత నారా లోకేష్.