మెట్రోని పరిశీలించిన శ్రీధరన్
posted on Sep 2, 2014 11:18AM
ఢిల్లీ మెట్రో రైలు వ్యవస్థ రూపశిల్పి, ఢిల్లీ మెట్రో మాజీ మేనేజింగ్ డైరెక్టర్, ‘మెట్రో మాన్’గా అందరూ పిలిచే శ్రీధరన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మెట్రో సలహాదారుగా బాధ్యతలు స్వీకరించే అవకాశం వున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్లో జరుగుతున్న మెట్రోరైలు పనులను పరిశీలించారు. ఉప్పల్, ఇతర ప్రాంతాలలో జరుగుతున్న మెట్రో పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో డైరెక్టర్ డాక్టర్ ఎన్.వి.ఎస్.రెడ్డిని శ్రీధరన్ అభినందించారు. ఉప్పల్లో ట్రైల్ రన్లో వున్న మెట్రో రైలులో కూడా ఆయన ఎక్కి రైలు ప్రయాణిస్తున్న తీరును పరిశీలించారు. హైదరాబాద్ మెట్రో డైరెక్టర్ ఎన్.వి.ఎస్. రెడ్డి ఈ సందర్భంగా శ్రీధరన్కి హైదరాబాద్ మెట్రోకి సంబంధించిన అన్ని విషయాలనూ కూలంకషంగా వివరించారు.