అంతా అయిపోయాక రైల్వే గేటు పెట్టారు!!

 

మెదక్ జిల్లాలో మాసాయిపేట దగ్గర కాపలా, గేటు లేని లెవల్ క్రాసింగ్ కారణంగా పదహారు మంది బడి పిల్లలు చనిపోయాక రైల్వే అధికారులకు జ్ఞానోదయం కలిగింది. ఆగమేఘాల మీద అక్కడ రైల్వే గేటును ఏర్పాటు చేశారు. ఇక్కడ రైల్వే గేటు ఏర్పాటు ఎప్పటి నుంచో కోరుతున్నా పట్టించుకోని రైల్వే అధికారులు 16 మంది చిన్నారులు చనిపోయాక గానీ కళ్ళు తెరవలేదు. దుర్ఘటన జరిగిన ప్రాంతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని వుంది. ప్రమాదం సంఘటనతో తీవ్ర దిగ్ర్భాంతికి గురైన కేసీఆర్ రైల్వే జిఎం శ్రీవాత్సవతో మాట్లాడి తక్షణమే గేటును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వెంటనే శ్రీవాత్సవ సికింద్రబాద్‌లోని ఉన్నత అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో వారు శుక్రవారం మాసాయిపేటకు చేరుకొని త్వరితగతిన పనులు చేపట్టారు. ఈ పని గతంలోనే చేసి ఉంటే 16మంది చిన్నారుల ప్రాణాలు నిలిచేవని స్థానికులు అంటున్నారు.