12 మంది పిల్లలు సేఫ్!

 

మెదక్ జిల్లా బస్సు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులలో 12 మంది ఆరోగ్యం కుదుటపడింది. వారికి ఇక ఏ ప్రమాదమూ లేదు. దాంతో ఆ విద్యార్థులను ఐసీయు నుంచి జనరల్ వార్డుకు మార్చారు. ఈ 12 మంది విద్యార్థులను మూడు రోజుల్లో ఇళ్ళకు పంపే అవకాశం వుంది. శివకుమార్, నిత్మష, శ్రీవాణి, శరత్ అనే విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా వుంది. వారిని మరికొంతకాలం వైద్యుల పర్యవేక్షణలోనే వుంచుతారు. అయితే ప్రశాంతి, వరుణ్ గౌడ్, వైష్ణవి, తరుణ్ అనే చిన్నారుల ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగా వున్నట్టు వైద్యులు చెబుతున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులెవరికీ ఆపరేషన్లు చేయాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.