TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కలెక్టర్ దంపతుల సైకిల్ సవారీ

Published on: Mon Aug 4, 2025 11:57AM

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు సైకిల్ పై ప్రయాణించారు. జిల్లా కేంద్రమైన మెదక్ నుంచి అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని రామాయంపేట వరకూ సైకిళ్లపై ప్రయాణించి వచ్చారు.  రామాయంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడి రోగులను పరామర్శించారు.

అలాగే వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులకు సూచించారు.  కలెక్టర్ దంపతులు మెదక్ నుంచి రామాయంపేట  వరకూ సైకిళ్లపై రావడాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. సైకిల్ తొక్కడం ఆరోగ్యకరం అన్న సందేశం చాటేందుకే వారు సైకిల్ పై 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చారని తెలుస్తోంది.