మాయావతి తమ్ముడు అక్రమ ఆస్తులు...

 

ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అధినేత్రి మాయావతి సోదరుడు ఆనంద్‌కుమార్ ఆస్తులపై ఐటీ శాఖ నిఘా పెట్టింది. మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న (2007-2014) కాలంలో.. అంటే ఏడేళ్లలో ఆయన ఆస్తులు రూ.7.5 కోట్ల నుంచి రూ.1,316 కోట్లకు పెరిగడంతో ఐటీ శాఖ నిఘా ఏర్పాటు చేసింది. బూటకపు కంపెనీలు, భారీగా రుణాలు, పెద్దఎత్తున రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ముసుగులో భారీగా ఆనంద్‌కుమార్ ఆస్తులు కూడబెట్టినట్టు ఐటీ గుర్తించిందని, వాటిపై విచారణ జరుపుతున్నదని, ఓ పత్రిక వెలువరించింది.