TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కర్రెగుట్టలపై రెచ్చిపోయిన మావోయిస్టులు.. జవాను పరిస్థితి విషమం

Published on: Thu Apr 10, 2025 1:27PM

చత్తీస్ గడ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు చెలరేగిపోయారు. ప్రెషర్ బాంబు పేలిన వెంటన కూంబింగ్ చేస్తున్న పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే  ప్రెషర్ బాంబు దాడికి ఒక జవానుకు తీవ్రగాయాలయ్యాయి. విషమ పరిస్థితిలో ఉన్న జవానును జిల్లా  ఆస్పత్రికి తరలించారు.  వచ్చే మార్చి కల్లా మావోయిస్టు రహిత దేశం చేస్తామని  కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. చిన్న కె డి పాల్ వాగు దాటుతున్న జవాన్ల ను చూసిన మావోయిస్టులు బెదిరిపోయి ప్రెషర్ బాంబు పేల్చారు. . కర్రెగుట్టలపై రావొద్దని ఇప్పటికే మావోయిస్టులు బెదిరింపు లేఖ  విడుదల చేశారు.  కర్రెగుట్టలు ఎక్కువ భాగం చత్తీస్ గడ్ లో ఉంది. కొంత భాగం తెలంగాణ ములుగు జిల్లాలో ఉంది. కర్రెగుట్ట మావోయిస్టులకు షెల్టర్ జోన్ గా ఉంది. ఆపరేషన్ కగార్ ప్రారంభమైన వెంటనే పోలీసులు   ఇక్కడ జల్లెడ పడుతున్నారు.   కర్రెగుట్టల్లో మాటు వేసిన మావోయిస్టుల ను మట్టు పెట్టడం అంటే పోలీసులు తమ ప్రాణాలను  రిస్క్ లో పెట్టినట్టే. ఓ వైపు మావోయిస్టులు శాంతి చర్చలకు ఆహ్వానిస్తూనే  జవాన్లపై ప్రెషర్ బాంబు పేల్చడం చర్చనీయాంశమైంది.   జవానుపై దాడి తర్వాత కర్రెగుట్ట ల్లో  మరో ఎన్ కౌంటర్ జరిగే అవకాశం ఉంది. సుమారు 100 కిలో మీటర్ల దూరం వరకు కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి.  ఇప్పటి వరకు జరిగిన ఎన్ కౌంటర్లలో అనేక మంది మావోయిస్టులు చనిపోయారు. కాగా గురువారం జరిగిన ఘటనలో మావోయిస్టులు  పోలీసులపై  పై చేయిగా నిలిచారు.