TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చత్తీస్ గడ్ లో పేలిన మావోయిస్టుల బాంబు

Published on: Sat Oct 19, 2024 5:28PM

కేంద్ర కమిటీ సభ్యురాలైన సుజాతక్క అరెస్ట్ తో మావోయిస్టులు  చెలరేగిపోతున్నారు.    మావోయిస్టులు ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు చత్తీస్ గడ్ లో మావోయిస్టులు మరోమారు చెలరేగిపోయీరు.  బాంబులు పేల్చడంతో నలుగురు  పోలీసులకు గాయాలయ్యాయి. వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నారాయణపూర్ జిల్లా అంబూజ్ మడ్ లో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. ఇటీవలి కాలంలో చత్తీస్ గడ్ లో వరుస ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్లలో వందలాది మంది చనిపోయారు. సురక్షిత ప్రాంతాలకు మావోయిస్టులు తరలి వెళుతున్నట్లు పోలీసులకు సమాచారమందింది. ఖమ్మం జిల్లా ఇల్లెందులో చికిత్స పొందుతున్న సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఈ అరెస్ట్ ను పోలీసులు ధృవీకరించలేదు. తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టులు తలదాచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.