గోవా ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు!!

 

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌కి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారింది. తాజాగా ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళల భద్రత గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.‘‘మా గోవా రాష్ట్రంలో అయితే అమ్మాయిలు అర్ధరాత్రి దాటినా భయం లేకుండా తిరగొచ్చు. అదే ఉత్తర ప్రదేశ్‌లో అయితే సాయంత్రం ఆరు దాటాక రోడ్డు మీదకి వస్తే అమ్మాయిలు మాయమైపోతారు’’ అన్నారు. కొన్ని రాష్ట్రాలు పనిగట్టుకుని గోవా పేరును చెడగొట్టి, తద్వారా గోవాకు వస్తున్న లక్షలాది మంది పర్యాటకులను తమ రాష్ట్రాలు ఆకర్షించేందుకు యత్నిస్తున్నట్లు మనోహర్ పారికర్ ఆరోపించారు. ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ గోవాకి వున్న మంచి పేరును చెడగొట్టడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.