నేను ఆరోగ్యంగానే ఉన్నా..పుకార్లు నమ్మొద్దు

తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని..తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను నమ్మొద్దన్నారు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్. గత కొద్ది రోజులుగా పారికర్ అనారోగ్యంతో బాధపడుతున్నారని..విషమంగా ఉందంటూ సోషల్ మీడియాలో పుకార్లు వస్తుండటంతో సీఎం స్పందించారు. ఆగస్టు 23న జరిగే ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని ప్రత్యర్థులు ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పదేళ్ల క్రితమే నాకు యాంజియోప్లాస్టీ జరిగింది. అప్పటి నుంచి ఆసుపత్రికి వెళ్లడం..చెక్ చేయించుకోవడం అలవాటు. ఎప్పటిలాగే ఈ సారి కూడా అలాగే వెళ్లి చెకప్ చేయించుకున్నానని..అయితే వైద్యులు యాంజియోగ్రఫీ చేస్తే మంచిదని చెప్పారని..వారి సూచన మేరకు చేయించుకున్నాను అన్నారు. నేను మామూలు మనిషినే..నాకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి అని చెప్పారు పారికర్.