యూరీ కారకులను వదిలిపెట్టేది లేదు-ప్రధాని మోడీ

యూరీలో 18 మంది వీర సైనికులను పొట్టనబెట్టుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమన్నారు ప్రధాని నరేంద్రమోడీ. మన్‌కీబాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించారు. వీర మరణం పొందిన సైనికులకు వందనం చేస్తున్నా అంటూ మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. యూరీ ఘటనను దేశ ప్రజలు ఎప్పటికీ మరచిపోరు. యూరీ ఘటన బాధిత కుటుంబాలకే కాదు..దేశ ప్రజల మనుసులను గాయపరిచిందన్నారు. ఈ వెన్నుపోటు ఘటనతో భరతజాతి అగ్గిమీద గుగ్గిలమైందన్నారు. భారత సైన్యం మాట్లాడదు, తానేం చేయగలదో చేసి చూపుతుంది. కశ్మీర్ లోయలోని ప్రజలకు ఎవరు జాతి వ్యతిరేకులన్న సంగతి తెలుస్తోంది. శాంతి, ఐకమత్యమే భారత విజయానికి కారణం. మన సమస్యలకు పరిష్కారం కూడా అదొక్కటే.