TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భూమి కబ్జా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ!

Published on: Sun Jul 6, 2014 1:44PM

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మపైన చెన్నై పోలీసులు చార్జీషీట్ నమోదు చేశారు. అతనికి చెన్నై నీలాంగరై సమీపంలో కానత్తూర్లో సొంత స్థలం కొంత ఉంది. దాని పక్కనే సేలంకుప్పన్ నీలాంగరై అనే వ్యక్తికి 75సెంట్ల స్థలం వుంది. తన 75 సెంట్ల భూమిని మణిశర్మ కంచె వేసినట్లు ఆయన పోలీసులకు పిర్యాదు చేశారు. క్రైం బ్రాంచ్ పోలీసులు మణిశర్మ స్థలం వద్దకు వెళ్లి పరిశీలించగా ఆయన ఆక్రమణకు పాల్పడ్డారనడానికి ఆధారాలు దొరికాయని అంటున్నారు. దీంతో పోలీసులు మణిశర్మపై కేసును నమోదు చేసి అతనికి అరెస్టు వారెంట్ జారీ చేశారు. మణిశర్మ మాత్రం కోర్టులో ముందస్తు బెయిల్ పొందారు.