టీడీపీ కార్యాలయానికి కోవిడ్ నోటీసులు

గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఉన్న టీడీపీ కార్యాలయానికి రెవెన్యూ అధికారులు కోవిడ్ నోటీసులను జారీ చేశారు. ఈరోజు, రేపు మహానాడు జరుగుతున్నందున కార్యాలయంలో కరోనా నివారణ చర్యలను తీసుకోవాలని నోటీసులో పేర్కొన్నారు. మంగళగిరి ఎమ్మార్వో పేరిట ఈ నోటీసులు జారీ అయ్యాయి. టీడీపీ కార్యాలయ సెక్రటరీ రమణకు ఆత్మకూరు వీఆర్వో ఈ నోటీసులు అందించారు. "రాజకీయ ఫంక్షన్లు, ఇతర సమావేశాలపై ప్రస్తుతం నిషేదం ఉంది. కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ 2005 ద్వారా చర్యలకు అర్హులు" అని నోటీసులో పేర్కొన్నారు.